పేదలని మోసం చేస్తున్న బస్తీ దవఖానాలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నారెడ్డి

అంబర్పేట్, జనవరి 19 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ వైద్య సేవలపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి . ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం బస్తీ దౌఖానాలను నడిపిస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకొస్తుంది కానీ అక్కడికి వెళ్లినటువంటి రోగులకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఎంతో మంది రోగులు తమ ఆరోగ్యం బాగోలేక తమ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక బస్తీ దావకానాలకు వెళితే అక్కడి వైద్యులు రాసినటువంటి మందుల్లో కొన్ని మాత్రమే వారి దగ్గర ఉన్నాయని ఎక్కువ ధర ఉన్నటువంటి మందులు బయట తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కావున ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి బస్తీ దావకానాలలో రోగులకు ఇవ్వాల్సినటువంటి మందులన్నీ వారి దగ్గరే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సొంటి రెడ్డి పున్నారెడ్డి