

అహ్మదాబాద్, జూన్ 12 (విశ్వం న్యూస్) : అహ్మదాబాద్ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో జలిలమయ్యింది.
ఈ ఘోర ప్రమాదంలో సర్వనాశనమైందనే వార్తలు వెలువడగా, అందరూ ప్రాణాలు కోల్పోయారని భావించారు. అయితే ఈ విషాద దృశ్యంలో ఒక చిన్న అద్భుతం చోటుచేసుకుంది. 11A సీటులో ప్రయాణిస్తున్న విశ్వాస్ కుమార్ రమేశ్ (40) అనే వ్యక్తి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు ధృవీకరించారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, విశ్వాస్ ప్రాణాలతో బయటపడటం కొంత ఊరటను కలిగించింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా సమాచారం తీసుకుంటోంది. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
ఇది దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘోర ఘటనగా నిలిచింది.