రూ.15 వేలు లంచంతో
పట్టుబడిన మహిళా ఇంజనీర్

- లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైన జీహెచ్ఎంసీ మహిళా ఇంజనీర్!- అంబర్పేట కార్యాలయంలో బిల్లుల ఆమోదానికి రూ.20,000 డిమాండ్ – తీసుకున్న 15 వేలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబాటు
హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్): అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మనీషా అనే అధికారిణి ఓ వ్యక్తి బిల్లులను ఆమోదించేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడు ముందస్తుగా ఏసీబీని ఆశ్రయించడంతో, మంగళవారం ఏర్పాటు చేసిన ట్రాప్లో అధికారులు దాడి చేశారు.
ఈ నేపథ్యంలో మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించనున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం ప్రతి ఫిర్యాదుపై తీవ్రంగా స్పందిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని దెబ్బతీయకూడదన్నదే ప్రజల ఆకాంక్ష.