బేదాగ్ఁ బాద్షా.బేఫనా షెహ్ఁజాదా. …

బేదాగ్ఁ బాద్షా.
బేఫనా షెహ్ఁజాదా.…

హైదరాబాద్, జనవరి 10 (విశ్వం న్యూస్) : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా చెప్పిన మాటలను ప్రజాస్వామికవాదులు, మేధావులు ఎలా విశ్వసించారో అర్థంకాదు….

అందరేమోగానీ కాంగ్రెస్ స్వభావం తెలిసిన హక్కులనేత హరగోపాల్ సార్ నమ్మడం విచిత్రం.
ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాస్ మార్కులు వేస్తున్నానని చెప్పడం మరీ విషాదం…..

దేశంలో ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్,కల్లోలితచట్టం తెచ్చింది కాంగ్రెస్,టాడా,పోటా,ఉపాలాంటి క్రూరమైన చట్టాలను అమలుచేసింది కాంగ్రెస్.
సప్త సముద్రాల్లో దాగి ఉన్న సుగంధ ద్రవ్యాలను తెచ్చి కడుక్కున్నా కాంగ్రెస్ చేతులకున్న నెత్తుటి వాసన పోదు…….

ఇంతటి దుష్ట చరిత్ర ఉన్న కాంగ్రెసు పునీతమవుతుందని ఎలా భావించారో మేధావులే చెప్పాలి.
ఎవరిని మోసం చేయడానికి కాంగ్రెస్ కి వత్తాసు పలికారో సెలవివ్వాలి.
మేధావులను కొనేసి,పాత్రికేయ రంగాన్ని గుప్పిట బందించి ప్రశ్నకు సమాది కట్టడం ఫ్యూడల్ పాలకుల స్వభావం…..

మద్యయుగాలనాటి ఫ్యూడల్ ప్రభువులకుండే నియంత లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ పాలనలో ఇంతకంటే మంచి పరిస్థితులను ఊహించలేం.
కోటిరూపాయలు,ఇంటిస్థలం ఇస్తానని ఆశచూపి మేధావులనబడేవారిని అధికారికంగానే కొనేశాడు.
తమ ఆగడాలకు బాపు కేసిఆర్ అడ్డుకట్టవేశాడనే దుగ్దతతో ఒక కులమీడియా కాంగ్రెస్ నాయకులకుబరితెగింపుతో మద్దతు పలుకుతుంది.
ఒక తెలంగాణ వ్యతిరేకి, సీమాంధ్ర పెత్తందారుల ప్రయోజనాలను కాపాడే బానిసలు ఈరోజు గద్దె మీదున్నారు.
సీమాంధ్ర పెత్తందారులతో మిలాఖతైన వ్యతిరేక శక్తులు..ఈరోజు తెలంగాణ అస్థిత్వానికి ఆపద తలపెడుతున్నారు ……

తెలంగాణ సంస్కృతిని కనుమరుగు చెసే కుట్రలకు దిగుతున్నాడు.
బతుకమ్మను మాయంచేశాడు.
కాకతీయ తోరణంను తొలగించాడు.
చార్మినార్ ని తీసివేశాడు.
బాపు కేసిఆర్ హయాంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచమంతా ప్రశంసించింది.
నేడు ఈ మూర్ఖులు ప్రతి అభివృద్ధి పనిలో అవినీతి వెతుకుతున్నారు ……..

తెలంగాణ ప్రగతిని,బాపు కేసిఆర్ ప్రతిష్టను అపహాశ్యం చేసే పనిలో ఉన్నాడు.
ప్రజలకు అలవికాని హామీలిచ్చి,వాటిని అమలుచేయడం చేతకాక డైవర్షన్ ఎత్తుగడలను ‌నమ్ముకున్నాడు.
అందులో భాగమే రామన్నపై తప్పుడు కేసులు.
ఎలాగైనా రామన్నను అరెస్టు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
దొంగ కేసులు పెట్టినంత మాత్రాన రామన్న దొంగ అయిపోడు.
ప్రజలపక్షాన నిలిచివారిని అరెస్టుచేయడం కాంగ్రెస్ కి అలవాటే.
ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ,అటల్ బిహారీ వాజపేయి లాంటి మహనీయులను కూడా కాంగ్రెస్ జైళ్ళో పెట్టింది.
అంతమాత్రానా వాళ్ళు దోషులు అయిపోలేదు.
వాళ్ళే కాంగ్రెస్ ని ప్రజల మద్యన దోషిగా నిలబెట్టారు.
ఇక్కడకూడా అంతే.‌. వీళ్ళు చేసే ప్రతి ప్రజావ్యతిరేక చర్యకు మూల్యం చెల్లించవలసిందే.
మా రామన్న కడిగిన ముత్యంలా వస్తాడు,ప్రజల కొరకు నిలబడుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *