బాసర గోదావరి నదిలో
స్నానానికి వెళ్లి
ఐదుగురు మృతి

- మృతులంతా దిల్ సుఖ్ నగర్ వాసులు
నిర్మల్, జూన్ 15 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర క్షేత్రమైన బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన దిల్సుఖ్నగర్ వాసులు ఐదుగురు గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగారు. నదిలో గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమవగా, మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు తక్షణమే రాస్టృ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
పుణ్యక్షేత్ర దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ విషాదం సంభవించిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.