
హైదరాబాద్, జూన్ 14 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను ఆధారంగా పోలీసులకు సమర్పించినట్టు బల్మూరి వెంకట్ తెలిపారు.
కేటీఆర్ చేసిన “సీఎం పదవిని డబ్బుతో కొనుగోలు చేశారు” అనే వ్యాఖ్యలు, పౌరస్థాయి పరంగా నిందనీయమని పేర్కొంటూ ఆయన చర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.