
హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : SLBC టన్నల్ లో చిక్కుకున్న వారిని బటయకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి. టన్నల్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అక్కడికి వెళ్లనున్నారు.
వనపర్తి బహిరంగ సభ నుంచి హెలికాఫ్టర్లో నేరుగా ఆయన టన్నల్ వద్దకు బయలుదేరనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు చేరుకోనున్నారు.