విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

వీణవంక, మార్చి 21 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈరోజు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 65 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ ఆర్టిఐ రక్షక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథితులుగా జిల్లా అధ్యక్షులు రాయికంటి కిరణ్, చల్లురు గ్రామ మాజీ ఉపసర్పంచి గుడేపు సమ్మయ, వర్కింగ్ ప్రెసిడెంట్ బండ మహేష్, జేఏసీ రాజయ్య, ఆర్టీఐ రక్షక్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బండి అజయ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ కట్ట రవి, చల్లూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.