క్యాట్ శుభవార్త: మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ ఆమ్రపాలి

హైదరాబాద్, జూన్ 24 (విశ్వం న్యూస్) : ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) నుంచి శుభవార్త వచ్చింది. గతంలో తెలంగాణలో సేవలందించిన ఆమ్రపాలిని మళ్లీ అదే రాష్ట్రానికి కేటాయిస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీయ్యాయి. ఏపీ కేడర్కు చెందిన ఆమె, గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్కు రిపోర్టు చేయాల్సి వచ్చింది. కానీ తాజా ఉత్తర్వులతో ఆమె మరోసారి తెలంగాణ సేవలో కొనసాగనుండటం ప్రముఖ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఆమ్రపాలి కేటాయింపుపై హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. గతంలో ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్గా పనిచేసి విశేష గుర్తింపు పొందారు. కాట ఆదేశాలతో ఆమె సహా పలువురు అధికారులను ఏపీలో నియమించగా, ఇప్పుడీ నిర్ణయం పునఃసమీక్షకై దారితీసింది.
ఈ పరిణామం, రెండు రాష్ట్రాల్లో కేడర్ కేటాయింపు అంశాన్ని మరోసారి ప్రాధాన్యంలోకి తెచ్చింది.