ఘనంగా స్వర్ణ జయంతి ఉత్సవాలు

జమ్మికుంట, ఏప్రిల్ 30 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో స్వర్ణ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం చందల రుపకంగ సేకరించిన 50 లక్షల రూపాయలతో నూతన భవనం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, ముక్క రాము, బచ్చు భాస్కర్, తుమ్మేటి సమ్మిరెడ్డి, డాక్టర్, ముక్క రాజేశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.