హైమావతి నగరంలో వింగ్స్ ఆఫ్ ఫైర్ డ్యాన్స్ స్టూడియో ప్రారంభోత్సవం

హైమావతి నగరంలో
వింగ్స్ ఆఫ్ ఫైర్ డ్యాన్స్
స్టూడియో ప్రారంభోత్సవం

హైదరాబాద్, జనవరి 1 (విశ్వం న్యూస్) : హైమావతి నగరంలో గూడూరి వన్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “వింగ్స్ ఆఫ్ ఫైర్ డ్యాన్స్ స్టూడియో” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో ఆయన తన మనవడైన మాస్టర్ డాన్సర్ గూడూరి వన్ రాజిరెడ్డికి ఆశీర్వచనం అందించారు.

NGOS, కోవిద సర్వోదయ ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండర్ ఫిలిం ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిటీ, HRCI సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్, మూవీ కాస్ట్యూమ్ డిజైనర్, ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీమతి హనుయా రెడ్డి గారు స్టూడియోను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, “మాస్టర్ డాన్సర్ వన్ రాజిరెడ్డి చిన్న వయసులోనే అనేక ప్రతిభలు కనబరిచారు. తాను స్థాపించిన ఈ డ్యాన్స్ స్టూడియో ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీసే పునాదిగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అతని విజయం మరింత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ, గూడూరి వన్ రాజ్ రెడ్డి చిన్నతనం నుంచే అపారమైన శ్రద్ధ మరియు ప్రతిభ చూపించాడని ప్రశంసించారు. తాను డ్యాన్స్ గ్రూపును స్వయంగా ఏర్పరచుకోవడమే కాకుండా, తన కోచ్‌లు కూడా అతని ప్రతిభను మెచ్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. వన్ రాజ్ రెడ్డి యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించడమేకాక, తన డ్యాన్స్ ద్వారా గుర్తింపు పొందుతూ తన కుటుంబానికి మరియు సమాజానికి గౌరవం తెచ్చినట్లు తెలియజేశారు.

డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి గారు యువతరం చిన్నతనం నుండే విద్యతో పాటు యోగ, డ్యాన్స్ వంటి కళాపరమైన రంగాలలో అభిరుచి కలిగి ఉండడంపై దృష్టి పెట్టడం అవసరమని పేర్కొన్నారు. ఇది చెడు వ్యసనములకు దూరంగా ఉండేటందుకు ఉపయోగపడుతుంది, వారి విలువైన సమయాన్ని చక్కటి మార్గంలో ఉపయోగించుకునేందుకు అవకాశం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే, తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ పిల్లల ప్రతిభను గుర్తించి, వారి మేధాశక్తిని పెంపొందించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తే, వారు దేశ ప్రగతికి పునాదులుగా నిలవగలరని ఆకాంక్షించారు.

ఈ సందేశం యువత మరియు వారి తల్లిదండ్రులకు మార్గదర్శకంగా నిలుస్తుందని, ఒక స్ఫూర్తి ప్రదాతగా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పడం తప్పు కాదు. ఈ విజయానికి వెనుక ఉన్న తల్లిదండ్రులైన జి. శ్రీధర్ రెడ్డి మరియు కళ్యాణ్ రెడ్డిల కృషిని ప్రత్యేకంగా గుర్తించి, వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. జి. విజయలక్ష్మి, డి. మంజులా రెడ్డి, చింతపల్లి శోభా రెడ్డి, లీషా వంశీ రెడ్డి, డి. ప్రత్యక్ష నంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *