ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్…— దాసోజు శ్రవణ్, MLC

హైదరాబాద్, నవంబర్ 18 (విశ్వం న్యూస్):సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో ఉమ్రా యాత్రకు బయలుదేరిన 40కి పైగా ముస్లిం యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన విషయం. మక్కా నుండి మదీనా వెళ్లే పవిత్ర ప్రయాణం ఇలాంటి భయంకరాంతంతో ముగిసిన వార్త ప్రతి హృదయాన్నీ కలిచివేస్తోంది.
ఈ దుర్ఘటనతో దుఃఖసముద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. అల్లాహ్ తాయాలా మరణించిన వారికి మఘ్ఫిరత్ ప్రసాదించి, వారి స్థాయిలను ఎత్తుగా చేయాలి.
వారి కుటుంబాలకు ఈ అకస్మాత్ విషాదాన్ని తట్టుకునే సబ్రే జమీల్ ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
పవిత్ర నేలపై, పవిత్ర యాత్రలో ఉన్న ఈ భక్తుల ఆత్మయానం — రహ్మత్, కరుణ, నూరు తో నిండినదిగా మారాలని అల్లాహ్ తాయాలా దువా చేస్తున్నాను.