16వ వార్డ్ బీఆర్ఎస్
పార్టీ కమిటీలు ఏకగ్రీవం

చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో
జమ్మికుంట, మే 30 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని 16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు అధ్వర్యంలో 16వ వార్డు కౌన్సిలర్ కుతాడీ రాజయ్య అధ్యక్షతన 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
16వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎల్కపెల్లి రాజేష్, ఉపాధ్యక్షులుగా కుతాడి తిరుపతి, బి.సి సెల్ అధ్యక్షులుగా పల్లపు మహేష్, ఎస్.టి సెల్ అధ్యక్షులుగా కెంసరపు బక్కయ్య ఎస్.సి సెల్ అధ్యక్షులుగా దాసరపు సాంబమూర్తి, ఉపాధ్యక్షులుగా వీర్ల రాజేష్, శనిగరపు సంపత్, ప్రధాన కార్యదర్శిగా బోడికల మల్లయ్య, యూత్ అధ్యక్షులుగా మిడిదొడ్డి శివాజీ, ఉపాధ్యక్షులుగా పుల్లూరి నరేష్, మారపల్లి సాయి వెంకట్, మైనారిటీ అధ్యక్షులుగా ఎం.డి బాబా, ఉపాధ్యక్షులుగా ఎం.డి అజార్, మహిళా అధ్యక్షురాలుగా దుస్స స్వరూప, ఉపాధ్యక్షులుగా మారపల్లి ఏమేల లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో 16 వ వార్డు బి.అర్.ఎస్ నాయకులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.