కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి గుండె పోటుతో కన్నుమూత

హైదరాబాద్, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : కళాతపస్వి కన్నుమూసి నెల రోజులైనా గడవక ముందే ఆయన సతీమణి జయలక్ష్మి గుండె పోటుతో మరణించారు. జయలక్ష్మి వయసు 86 ఏళ్లు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, జయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
బాధాకరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాద
ఈ నెల 2 వ తేదీన విశ్వనాధ్ గారు మరణించగా, ఇంతలోనే వారి సతీమణి మృతి చెందడం అత్యంత బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.