కాజీపేటలో.. వసంతోత్సవ శోభ..

కాజీపేటలో.. వసంతోత్సవ శోభ..

  • ఏనుగుపై శ్వేతార్కుడి ఊరేగింపు
    ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
    వాడవాడల అన్న ప్రసాద వితరణలు

కాజీపేట, మే 3 (విశ్వం న్యూస్): స్వయంభు శ్వేతార్క మూల గణపతి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న 27వ వసంతోత్సవాల వేడుకలతో కాజీపేటలో వసంతోత్సవ శోభ నెలకొంది. ఈ వసంతోత్సవాల్లో భాగంగా శ్వేతార్కుడిని ఏనుగు పై ఊరేగించారు. కాజీపేట పురవీధుల్లో కొనసాగిన ఈ గజారోహణ శోభయాత్రకు ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి శ్వేతార్కుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఏనుగు పై శ్వేతార్కుడి యాత్రను తిలకించడానికి భక్తులు ఉచ్చుకతను ప్రదర్శించారు. వందలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనడంతో కాజీపేటలో పండుగ వాతావరణం కనిపించింది. వసంతోత్సవాలను పురస్కరించుకొని వాడవాడలా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న దర్బార్ సేవ ఉత్సవాల ప్రత్యేకతను చాటుకుంటుంది. శనివారం రోజున నల్ల ద్రాక్ష ఫలరస గంగాజలములతో గణపతి సూక్తభిషేకం జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవాన్ని భక్తులు ఆద్యంతం భక్తిశ్రద్ధలతో తిలకించారు. సాయంత్రం నువ్వుల లడ్డులతో సహస్రనామార్చన గావించారు.

నేటి పూజా వివరాలు
స్వయంభూ శ్వేతార్క మూల గణపతి 27వ వసంతోత్సవాల పూజల వివరాలను ఆలయం నిర్వాహకులు బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మలు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీ స్వామివారికి 108 గణపతి ఉపనిషత్తు ఇక్షురాసాభిషేకం, 10 గంటలకు మహాసౌరా, అరుణ హోమం, పూర్ణాహుతి, ఐదున్నర గంటలకు మోదకాలు వెన్నతో చేసిన తీపి పొంగలి బూందీ లడ్డులతో సహస్రనామార్చన, సాయంత్రం కల్యాణోత్సవం అనంతరం శ్రీ శ్వేతార్క గణపతి మహరాజుకు గణపతి యోగ పట్టాభిషేకం ఉంటుందని వారు తెలిపారు.


వార్త…..శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *