కరీంనగర్:కాంగ్రెస్ పథకాలకు
ప్రజల నుండి మంచి ఆదరణ

- 49 డివిజన్ బోయవాడలో గడప గడపకు కాంగ్రెస్
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు.పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి బ్రతుకు భారమైపోయిందని కాంగ్రెస్ పథకాలు భాగున్నాయాయని కాంగ్రెస్ హాయంలోనే సామాన్యుడు సంతోషంగా ఉంటాడని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు.

కరీంనగర్ బ్యూరో,, జూలై 10 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పథకాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా 49 డివిజన్ బోయవాడలో ఇంటిటికి తిరుగుచూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజ్జ రవికుమార్, నాగుల సతీష్,దన్న సింగ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,లింగంపల్లి బాబు,గడ్డం విలాస్ రెడ్డి, దండి రవీందర్,మెతుకు కాంతయ్య, బత్తినీ చంద్రయ్య, మ్యాకల నర్సయ్య, ముక్క భాస్కర్, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి,షేక్ శేహెన్ష, కూన దామోదర్, సలిమోద్ధిన్, జీడీ రమేష్, కీర్తి కుమార్, రాజ్ కుమార్, మామిడి సత్యనారాయణ రెడ్డి,నెల్లి నరేష్, సయ్యద్ ఖలీల్, నదీమ్, అజ్మత్, గంగుల దిలీప్, హనీఫ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.