
పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు
హైదరాబాద్, మార్చి 28 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ మటన్ క్యాంటీన్లకు ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్లు’గా నామకరణం చేయనున్నారు. ఇందుకోసం పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
తొలుత హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఆ శాఖ కార్యాలయ ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటుచేసి, ఆ తర్వాత దశలవారీగా అన్ని జిల్లాల్లో విస్తరించనున్నారు. నాణ్యమైన మటన్ను సరసమైన ధరలకు ఉంచుతామని అధికారులు తెలిపారు.