జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటీఆర్

జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటీఆర్

జగిత్యాల, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి ఆహ్వానించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు వారి నివాసానికి వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్ తరఫున ఆయనను అధికారికంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి గారు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలో కేసీఆర్ గారిని కలసి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని జీవన్ రెడ్డి గారు చెప్పినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో రైతులు, పేదలు మళ్లీ సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన నాయకులు అవసరమని, అందుకే జీవన్ రెడ్డి గారి సహకారం కోరుతున్నామని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్, రైతు బంధు అమలు లోపాలు, నిరుద్యోగ సమస్యలు, గ్యారెంటీల అమలులో వైఫల్యాలను ప్రస్తావించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం భావోద్వేగంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *