తపస్య అకాడమీ & చెన్నై వెరాండా ఐఏఎస్ అకాడమీ మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్, జూన్ 30 (విశ్వం న్యూస్): తెలంగాణలో సివిల్స్ అభ్యర్థులకు మరింత నాణ్యమైన శిక్షణను అందించేందుకు తపస్య అకాడమీ కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా పేరొందిన చెన్నైకు చెందిన వెరాండా ఐఏఎస్ అకాడమీతో తపస్య అకాడమీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యంతో తపస్య అకాడమీ విద్యార్థులకు దేశస్థాయి మెంటారింగ్, నిపుణుల బోధన, టెస్ట్ సిరీస్, కాంటెంట్ లభించనున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అనుగుణంగా కోచింగ్ రూపొందించనున్నారు. తపస్య గ్రూప్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ.. “మా విద్యార్థులు ఇప్పుడు నేషనల్ స్టాండర్డ్ కోచింగ్ ను స్వగ్రామంలోనే పొందే అవకాశం కలిగింది. ఇది వారి విజయానికి మైలురాయిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

  • తపస్య అకాడమీ-వెరాండా ఐఏఎస్‌
    ఒప్పందం – ముఖ్యాంశాలు:
  • తెలంగాణలో సివిల్స్ అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ కల్పించేందుకు కీలక ఒప్పందం
  • తపస్య అకాడమీ & చెన్నై వెరాండా ఐఏఎస్ అకాడమీ మధ్య అవగాహన ఒప్పందం
  • తపస్య విద్యార్థులకు:
    • దేశస్థాయి మెంటారింగ్
    • నిపుణుల బోధన
    • ప్రామాణిక టెస్ట్ సిరీస్
    • సమగ్ర కంటెంట్
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అనుగుణంగా ప్రత్యేక కోచింగ్ రూపకల్పన
  • “నేషనల్ లెవల్ శిక్షణ స్థానికంగానే” – తపస్య డైరెక్టర్ వ్యాఖ్య
  • “తెలంగాణలో భాగస్వామ్యం గర్వకారణం” – వెరాండా ఐఏఎస్ ప్రతినిధులు
  • యువతకు నాణ్యమైన సివిల్స్ శిక్షణ అందుబాటులోకి రానుండటం విశేషం

చెన్నై వెరాండా ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “తెలంగాణలో తపస్యతో కలిసి పనిచేయడం మాకు గౌరవంగా ఉంది. దేశంలోని ఉత్తమ ర్యాంకులు సాధించేలా ఈ భాగస్వామ్యం విద్యార్థులకు దోహదపడుతుంది” అని తెలియజేశారు.

ఈ ఒప్పందంతో యువతకు నాణ్యమైన సివిల్స్ శిక్షణ అందుబాటులోకి రానుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *