వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ‘నవోత్సాహ’ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ

వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ‘నవోత్సాహ’ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ

తిమ్మాపూర్, జూన్ 12 (విశ్వం న్యూస్): తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ‘నవోత్సాహ’ పేరిట ఫ్రెషర్స్ డే వేడుకలు వేడుకగా నిర్వహించాయి. బీటెక్ సిఎస్సీ, సిఎస్సీ (డేటా సైన్స్) రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కళాశాల జనరల్ సెక్రటరీ డా. గండ్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్ధులు కేవలం పాఠ్యపుస్తకాల్లోనే కాక, టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. “ప్రస్తుతం ఏఐ సాంకేతికత వైద్య విద్యారంగం సహా అన్ని రంగాలలో విస్తరిస్తోంది. వచ్చే రెండేళ్లలో మానవ మేధస్సును మించి ప్రదర్శించే అవకాశాలు ఏఐకి ఉన్నాయి” అని అన్నారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి డా. డి. శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు విశ్వనాథ్ వినోద్, సిహెచ్. ప్రకాష్ రెడ్డి, ఆశిష్ విశ్వనాథ్, ప్రిన్సిపల్ డా. సిహెచ్. శ్రీనివాస్, సిఎస్సీ విభాగాధిపతి డా. ఎన్. చంద్రమౌళి, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *