కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

రూ.లక్ష మాఫీ చేయడం పట్ల హర్షం
వీణవంక, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : ఈ రోజు వీణవంక మండలంలో ఘన్ముక్ల గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన క్రాఫ్ లోన్స్ లక్ష రూపాయలు మాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో పిఎ.సి.ఎస్సి డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జునూతుల సునీత మల్లారెడ్డి, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నాగిడి సంజీవ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కాంతాల రాజిరెడ్డి, యూత్ అధ్యక్షులు గాజుల విజయ్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.