కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తిరుమలగిరి, ఆగస్టు 4 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన క్రాఫ్ లోన్స్ లక్ష రూపాయలు మాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుమలగిరి మండల0 తొండ రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎంపీపీ నెమరుగోమ్ముల స్నేహలత, వంగాల దానయ్య, గోపన్న, రామాంజనేయులు, గొలుసుల మల్లయ్య, మహమ్మద్ షకిల్ పాషా, ఏమోజు రవీందర్, వేల్పుల లింగన్న, దయా యాదవ్, మున్సిపాలిటీ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నాని, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.