ప్రజాహితమే పాత్రికేయుల లక్ష్యం
కావాలి:ఎమ్మెల్యే కవ్వం పల్లి

- జర్నలిస్టులకు అండగా ఉంటాం.. ఎమ్మెల్యే కవ్వం పల్లి
తిమ్మాపూర్, జనవరి 5 (విశ్వం న్యూస్) : జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారా యణ భరోసా నిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, ఆదివారం జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరిం చారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ దూసే టి మహేందర్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభం లాంటివని అన్నారు. ఎప్పటికప్పుడు పత్రికలు ప్రజలను జాగృతపర్చడం వల్లనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. స్వాతంత్రోద్యమంలో పత్రికలు పోషించిన పాత్ర అమోఘనీయమైనదని ఆయన శ్లాఘించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మరింత బాధ్యతగా, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన పత్రికలు కబంధ హస్తాల్లో చిక్కు కోవడం దురదృష్టకర పరిణామమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుల చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా, పాత్రికేయుల సంధానకర్తలుగా వ్యవహరిస్తూ తమవంతు బాధ్య తలు పోషిస్తున్నాయని ఆయన కొనియాడారు.

ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబు దారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ప్రభుత్వాలకు పత్రికలు, పాత్రికేయుల తోడ్పడాలని ఆయన కోరారు. అలాగే రాజకీయ పార్టీల నాయకు లు, ప్రజాప్రతినిధుల తప్పిదాలను ఎప్పటికప్పు డు ఎత్తిచూపుతో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచ నలు అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు, సంఘాల్లో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే అయినప్పటికీ జర్నలిస్టుల యూనియన్ లో ఉన్న వారు విభేదాలను విడనాడి జర్నలిస్టుల ఐక్యత, హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇప్పించే విషయంలో జాప్యానికి ప్రభుత్వ ఆంక్షలే అవరోధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారా యణ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారా యణ, తిమ్మాపూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ (సాక్షి), ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్ (టీవీ5) ఉపాధ్య క్షులు నాగెల్లి ఆంజనేయు లు (మైత్రి), ఎండీ రహీం (బిగ్ టీవీ), గౌరవ అధ్యక్షుడు ముస్కు లక్ష్మారెడ్డి (మహా న్యూస్), జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్(ప్రైమ్ 9), సలహా దారు వేల్పుల రాజు(నమస్తే తెలంగాణ), కోశాధికారి ఆంజనేయులు (నవ తెలం గాణ), సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్ (ఎన్టీవీ), బోమాడి శ్రీధర్ రెడ్డి (నమస్తే తెలంగాణ రూరల్), ప్రచార కార్య దర్శి జాప నాగరాజు (చురుకలు), లీగల్ అడ్వైజర్ మాతంగి రవి (దిశ), కార్యవర్గ సభ్యులు బొమ్మిడి విజయ కుమార్ (మన తెలంగాణ), తూముల శ్రీనివాస్ (టీ న్యూస్), విష్ణు (ఆంధ్రప్రభ), రాజిరెడ్డి (99టీవీ)లతో పాటు జర్నలిస్టు నూతన కార్యవర్గం, జర్నలిస్ట్ సభ్యులను ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.