భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న “శ్వేతార్కుడు”

భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న “శ్వేతార్కుడు”

  • తెల్ల జిల్లేడు చెట్టు నుండి ఆవిర్భవించిన..స్వయంభు శ్వేతార్క మూల గణపతి స్వామి..!
  • నేటి నుంచి 27వ వసంతోత్సవాలు
    విద్యుత్ దీపాలతో విరాజిల్లుతున్న దేవాలయం


కాజీపేట, ఏప్రిల్ 30, (విశ్వం న్యూస్):హనుమకొండ జిల్లాలో.. కాజీపేట పట్టణ కేంద్రంలో.. సంపూర్ణ సర్వ అవయవాలతో స్వయంభుగా తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుండి శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామి వారు ఆవిర్భవించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సభ ఉపాధ్యక్షులు, శ్రీ భద్రకాళి దేవస్థానం సిద్ధాంతి, బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి 1996 నుంచి గణపతి సేవ చేస్తున్న సమయంలో ఏప్రిల్ 20, 1999న శ్రీ స్వామివారి స్వప్న సాక్షాత్కారంతో నల్గొండ ప్రాంతంలోని మాడ ప్రభాకరశర్మ గారి ఇంటి పరిసరాలలో నుంచి లభ్యమైన తెల్ల జిల్లేడు చెట్టులోని మొదల్లో శ్రీ స్వామివారి మూర్తిని గ్రహించి పెద్దల ఆశీస్సులతో తీసుకొని వచ్చి మే 4 1999 రోజున అనేకమంది వేద పండితులు, ఉపాసనపరులు..బ్రహ్మశ్రీ త్రిపురారి వెంకటేశ్వర శర్మలచే ప్రాణ ప్రతిష్ట చేయించారు. అనంతరం మే 1, 2022న విష్ణుపురిలో స్వయంభు శ్వేతార్క మూల గణపతి స్వామి వారికి ప్రత్యేకంగా దేవాలయం నిర్మాణం గావించారు. అప్పటినుంచి స్వామివారి వసంతోత్సవాలను (పుట్టినరోజు వేడుకలు) అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వయంభు శ్వేతార్క మూల గణపతి స్వామి వారితో పాటు పలు దేవతామూర్తులు కొలువుదీరేలా ఆ దేవాలయంను అభివృద్ధి చేశారు. వేలాది మంది భక్తుల ఇలవేల్పుగా.. సకల వాస్తు దోష నివారకుడుగా… సర్వ కార్య సిద్ధికరుడుగా.. విఘ్నాలు తొలగిస్తున్న గణనాధుడిగా.. శ్రీ స్వయంభు శ్వేతార్క మూల గణపతి స్వామి వారు వేలాది మంది భక్తులచే పూజలు అందుకుంటున్నారు.

ఈ ఆలయంలో వసంతోత్సవాలు.. కల్యాణోత్సవములు ఈనెల 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వసంతోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో శ్వేతార్క ఆలయం విరాజిల్లుతుంది. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొంటుండడం విశేషం.
నేటి పూజా వివరాలు..


వసంతోత్సవాల ప్రారంభం రోజైనా ఈనెల 30వ తేదీన బుధవారం రోజున ఉదయం ఐదున్నర గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని ఆలయ నిర్వాహకులు బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణశర్మ, సాయి కృష్ణ శర్మలు తెలిపారు. 6 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృత, జామ ఫల రసాలతో ప్రత్యేక అభిషేకం, 9 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనము, గోపూజ, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపా స్థాపన, ధ్వజారోహణం, 10 గంటలకు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట దేవాలయ స్థాపిత దేవత మూలమంత్ర హోమములు, 11 గంటలకు కోటి శ్వేతార్క గణపతి మూలమంత్ర నామ జప పారాయణం ప్రారంభం, సాయంత్రం ఐదున్నర గంటలకు సహస్ర పెసరూ లడ్డూలతో సహస్రనామార్చన, ఆరున్నర గంటలకు తాడూరి రేణుక బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ఈ పూజల అనంతరం ప్రత్యేకంగా దర్బార్ సేవా పూజా కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఈ వసంతోత్సవాలు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు చర్మ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.


వార్త….శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *