అలుగునూర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం : అధ్యక్షుడిగా చిందం మల్లేశం ఎంపిక

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, జూన్ 13: తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ (8వ డివిజన్) గ్రామంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.
నూతన కార్యవర్గంలో:
అధ్యక్షుడిగా చిందం మల్లేశం
ఉపాధ్యక్షుడిగా చిందం సంపత్
గౌరవ అధ్యక్షుడిగా చిందం మల్లేశం
ప్రధాన కార్యదర్శిగా చిందం మహేష్
సహాయ కార్యదర్శిగా కోమటిరెడ్డి రమేష్
కోశాధికారిగా సల్ల కిష్టయ్య
ముఖ్య సలహాదారులుగా చిందం లింగయ్య, పురంశెట్టి అనోహర్, ఈరుపాటి రాజయ్య, చిందం చంద్రయ్య.
కార్యవర్గ సభ్యులుగా చిందం కరుణాకర్, సల్ల కనకయ్య, చిందం శ్రీనివాస్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలతో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.