
- తెలంగాణలో 9 మందికి పేర్ల ప్రకటన
- మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్
హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : బీజేపీ పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థులను శనివారం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తొలి జాబితాను ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేయనున్నట్లు వినోద్ తావ్డే పేర్కొన్నారు. 195 లోక్సభ స్థానాలకు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ.. ఇందులో తెలంగాణ నుంచి 9 మందికి అవకాశం కల్పించింది.
ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అవకాశం కల్పించింది. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, హైదరాబాద్ మాధవీలత, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్రెడ్డికి అవకాశం కల్పించారు.