కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి

అంబర్ పేట, జనవరి 26 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి పున్నా రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాల్ మహమ్మద్, ఏఐసిసి హ్యూమన్ రైట్స్ మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్ గవనే చందు, ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెంబర్ దండే రాజు, బేకరీ గడ్డ ప్రెసిడెంట్ గఫర్, శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.