శ్రీశైలం వైపు విశ్వకర్మ యువయాత్ర

  • రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖుల సమక్షంలో ఘన ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, జూన్ 22 (విశ్వం న్యూస్): ట్యాంక్‌బండ్‌ పై వెలసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం సన్నిధిలో ఈరోజు ఉదయం విశేష పూజలతో విశ్వకర్మ యువయాత్రకు భక్తిపూరితమైన ఆరంభం కలిగింది. శ్రీశైలం వైపు సాగనున్న ఈ పావన యాత్రలో వందలాదిమంది విశ్వకర్మ యువత పాల్గొని ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలిచారు.

ఈ యాత్రకు తెలంగాణ తొలి శాసన సభాపతి మరియు శాసన మండలి ప్రతిపక్ష నేత బ్రహ్మశ్రీ మధుసూదనాచారి గారు, మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మశ్రీ కిరణ్ కుమార్ చారి సర్ ముఖ్య అతిథులుగా హాజరై యాత్రకు శుభారంభం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అమీర్‌పేట గాయత్రీనగర్ సోదరులు పి. శివ ప్రసాద్, పి. వినోద్ కుమార్ గార్ల కృషి అపూర్వమని అభినందనలు వెల్లువెత్తాయి.

పోతులూరి స్వామి ఆధ్యాత్మిక సందేశాన్ని సమాజానికి చాటి చెప్పే సంకల్పంతో శ్రీశైలం వైపు సాగుతున్న ఈ యువయాత్ర, విశ్వకర్మ సమాజ ఐక్యతకు, ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *