సాఫ్ట్ బాల్ క్రీడాభివృద్ధికి అండగా నిలుస్తా

సాఫ్ట్ బాల్ క్రీడాభివృద్ధికి అండగా నిలుస్తా

  • వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, మే 26 (విశ్వం న్యూస్):సాఫ్ట్ బాల్ క్రీడాభివృద్ధికి అండగా నిలుస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులతో కలిసి ఆ క్రీడా సంఘం సెక్రటరీ తాబేటి రాజేందర్ హనుమకొండలోని బాలసముద్రంలో ఎమ్మెల్యేను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరారు. అంతకుముందు రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి బాలుర విభాగంలో వి.పవన్ కుమార్, ఎం. జగదీష్ బాలికల విభాగంలో ఏ.స్ఫూర్తి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 29 నుండి జూన్ రెండవ తేదీ వరకు చండీగఢ్లో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ పోలేపాక వినయ్ కుమార్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *