హైదరాబాద్:ఘోర రోడ్డు ప్రమాదం..
ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : శంకర్ పల్లి నుండి గండిపేట్ సైడ్ వెళ్తున్నసమయంలో ఖానాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సును ఓవర్టేక్ చేయబోయి ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
