హైదరాబాద్:ఏసిటిఓలకు
గజిటెడ్ హోదా కల్పించండి

- టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి
హైదరాబాద్, మే 27 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలని 2017 సంవత్సరము నుండి అడుగుతున్నామని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం పక్షాన అప్పటి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఏ అనిల్ కుమార్ కు రిప్రజెంటేషన్ సమర్పించగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అప్పటి అజయ్ మిశ్రాకు పంపించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వకపోవడం చాలా అన్యాయమని శనివారం రోజు టీఎన్జీవోస్ భవనములో జరిగిన ఉద్యోగుల సమావేశంలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తోపాటు సంఘ నాయకులు జి బిక్షపతి, ఏ అనిల్ కుమార్, శంకర్, సారయ్య, ఎం ఏ భారీ ముత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో ఏసిటిఓ హోదా ఇచ్చినంత మాత్రాన ఖజానాపై ఎటువంటి భారం పడదు అని ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 లో కోపరేటివ్ రిజిస్టర్, సబ్ రిజిస్టర్, డిప్యూటీ తాసిల్దార్, సబ్ ట్రెజరీ అధికారి, మున్సిపల్ కమిషనర్ ఇలాంటి అధికారులందరూ గజిటెడ్ హోదాలో కొనసాగుతుండగా ఒక వాణిజ్య పనుల ఏసిటిఓలకు గ్రూప్ 2 పరిధిలో ఉన్నప్పటికీ వీరిని ఈ వాణిజ్య పనుల శాఖలో ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా ఇవ్వకుండా నాన్ గెజిటెడ్ హోదా కింద ఏసిటీవోలు పనిచేస్తున్నారని అందుకే ఇతర శాఖలలో పనిచేస్తున్న అధికారులందరికీ గజిటెడ్ హోదా ఇచ్చినప్పుడు వాణిజ్య పనుల శాఖలు పనిచేస్తున్న ఏసిటిఓ లకు కూడా గెజిటెడ్ హోదా కల్పించాలని చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి కు విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఏసిటిఓలకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ జేఏడీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ, పిఆర్సి కమిషన్ ఇంతమంది అధికారులు చీఫ్ సెక్రటరీకు లేఖలు రాయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు 8 సంవత్సరాల నుండి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించలేదు చాలా అన్యాయం అని తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి, జాయింట్ సెక్రెటరీ రాంసింగ్, వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతు కుమారి ప్రసాద్ చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర టీసీటీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.