సైనికునికి సన్మానం చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

సైనికునికి సన్మానం చేసిన
కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

  • దేశ భద్రత కోసం పని చేసి పదవీ విరమణ పొందిన సైనికునికి సన్మానం చేసిన నగర కాంగ్రెస్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 7 (విశ్వం న్యూస్) : ఆక్సిజన్ సరిగా అందని ఎతైన హిమాలయాల్లో మరియు పాకిస్తాన్,చైనా సరిహద్దుల్లో వివిధ హోదాల్లో ఇరవై సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందిన కడారి మహేశ్వర్ రెడ్డిని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దుల్లో పహారా కాస్తూ కన్న వారికి,కుటుంబానికి,స్నేహితులకు దూరంగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ భద్రత కోసం పని చేయడం గర్వకారణం అని నరేందర్ రెడ్డి అన్నారు.

విదినిర్వహణలో భాగంగా హిమాలయాల్లో పహారాకాసే సమయంలో ఎముకలు కోరికే చలి వల్ల ఇన్ఫెక్షన్లు రావడం చికిత్స చేయించుకోవడం శత్రు మూకల కవ్వింపు చర్యలను తిప్పికొట్టడం కొన్ని ప్రాంతాలలో ప్రతి కూల వాతావరణాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నరేందర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, షబానా మహమ్మద్, ముల్కల కవిత, ఊరడి లత, అన్నే జ్యోతి రెడ్డి, మహాలక్ష్మి, మెతుకు కాంతయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, ముల్కల యోన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *