
- ధాన్యం అమ్మి 2 నెలలైనా-రైతుల ఖాతాల్లో పడని నగదు
- పంట నష్ట పరిహారం 3నెలలైనా-రైతులకు అందని ద్రాక్షేనా…. ?
జమ్మికుంట/ఇల్లంత కుంట, జూన్ 13 (విశ్వం న్యూస్) : ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గూడపు సారంగపాణి ఐ.కె.పి సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ ఐ.కె.పి సెంటర్ల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రెండు మాసాలు అవుతున్న రైతులకు డబ్బులు వారి ఖాతాలో వేయకపోవడం మరియు ఐ.కె.పి సెంటర్లో తూకాల్లో మోసాలు చేసి, అమ్ముకున్న ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని, అకాల వర్షం పడినందువలన యాసంగి పంటకు వరి, మొక్కజొన్న, మిర్చి, నేలపాలై పంట నష్టం జరిగింది.

ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర సి.ఎం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేకపోవడం పట్ల రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినట్లుగా భావిస్తున్నామని దుయ్యబట్టారు. ముసలి కన్నీరు కాస్తున్న ఈ బి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని , రైతులకు డబ్బులు వెంటనే వారి వారి ఖాతాలో వేయని యేడల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కె.సి.అర్ ను రైతులు ఎన్నికలలో తరిమి కొడతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి శివకుమార్, తాడం దిలీప్ కుమార్, తిరుపతి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.