నా లాయక్

  • బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ లాంటి లంపెన్ గాళ్ళు నాయకులుగా ఎదగడం విషాదం

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విశ్వం న్యూస్) : అట్టడుగువర్గాలకు అధికారం చేరువ చేయాలన్న సదుద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చేర్చారు.

మన ఖర్మ ఏమోగానీ అంబేద్కర్ గారి ఆకాంక్షకు విరుద్దంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురుసైకోగాళ్ళు నాయకులుగా ఎదిగారు. ఒకప్పుడు విప్లవోద్యమం వెల్లువెత్తిన ఉత్తర తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్,రఘునందన్ లాంటి లంపెన్ గాళ్ళు నాయకులుగా ఎదగడం విషాదం.

విప్లవపోరాటాలకు పుట్టినిల్లు అయిన ఉత్తర తెలంగాణలో మత రాజకీయాలు పెచ్చరిల్లిపోతాయని మనం అనుకున్నామా? నైజాం వ్యతిరేక సాయుధ సమరానికైనా,నక్సల్బరి రైతాంగపోరాటానికైనా,మలిదశ తెలంగాణ విముక్తి పోరుకైనా కరీంనగర్ వేదిక అయింది. బాపు కేసిఆర్ మొదట సభ అక్కడే ప్రారంభించారు.
ఎంపి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళింది కూడా కరీంనగర్ నుండే.

వలస దొంగలంతా ఏకమై డబ్బుల కుప్పలు పారబోసినా కరీంనగర్ ప్రజానీకం బాపు కేసిఆర్ కే పట్టంకట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను దేశమంతా ఎలుగెత్తి చాటింది కరీంనగర్ గడ్డ. ఎంతోమంది వీరులకు జన్మనిచ్చిన గడ్డ నేడు సంజయ్ లాంటి హిరణ్యకశిపుడికి ఊపిరిపోసి కన్నీరుపెడుతుంది. గుజారాతోని చెప్పులు మోసి ఎంపిగా,మంత్రిగా పదవులు సంపాదించుకున్నోడు మన రామన్న గురించి మాట్లాడుతున్నాడు.

తెలంగాణ పోరాటంలో త్యాగాలకు వెరువక ముందుకురికిన రామన్నపై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.
తెలంగాణ విముక్తికోసం రామన్న వలసవాదులతో తలపడినప్పుడు బండి సంజయ్ తంబాకులు నములుకుంటూ వీధుల్లో తిరిగే అవారాగాడు.

ఈ ముగ్గురు మూర్ఖులు
విమర్శించాల్సింది పాలకపక్షాన్ని అన్న విచక్షణ మరిచి ప్రతిపక్షాన్ని తూలనాడుతున్నారు. బిజెపి నేతలకు ప్రజల మద్య విద్వేషాలు సృష్టించి లబ్దిపొందడంతప్పా ప్రజాసమస్యలు పట్టవు. బండి సంజయ్, దర్మపురి అరవింద్, రఘునందన్ లాంటివారు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా?????

ఎప్పుడూ దేవుడు, దెయ్యం, కులం, మతంలాంటి పనికిరాని విషయాలు తప్పిస్తే నిరుద్యోగం మీద, పేదరికంమీద మాట్లాడారా? కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడుగడుగునా నిలదీస్తున్న రామన్నను విమర్శించే హక్కు బిజేపి నేతలకు లేదు. మన కృష్ణానీటిని యధేచ్ఛగా ఆంధ్రోడు కొల్లగొట్టుకుపోతుంటే రామన్న, హరీషన్నలు వీరోచితంగా అడ్డుకుంటున్నారు.

రుణమాఫీ జరగక, రైతుబంధు అందక విలవిల్లాడుతున్న రైతాంగానికి మద్దతుగా నిలుస్తున్న రామన్న హరీషన్నలను తిట్టే అర్హత వీళ్ళకెక్కడిది? బిజేపి నేతలు ఇట్లాంటి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారా????? కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతూ బిఆర్ఎస్ ను బలహీనపర్చే నీచ రాజకీయాలకు దిగుతున్న బండి సంజయ్, దర్మపురి అరవింద్, రఘునందన్ లాంటి చౌకబారు నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారు. నిత్యం విద్వేషాలు సృష్టించే ఇటువంటి వాళ్ళను గెలిపించడవల్ల సమాజానికి నష్టం జరుగుతుందన్న విషయం ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *