
హైదరాబాద్, నవంబర్ 9 (విశ్వం న్యూస్) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయ హీట్ గరిష్ట స్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, విపక్ష BRS, BJP మధ్య పోటీ తారస్థాయిలో కొనసాగుతోంది. ఈ సారి ఒక్క మాటే హాట్టాపిక్ — “అభివృద్ధి”. ప్రతి పార్టీ తనదైన విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, BRS మాత్రం అభివృద్ధి అజెండాపైనే నమ్మకం ఉంచి ముందుకు సాగుతోంది.
“అభివృద్ధి అంటే BRS, BRS అంటే అభివృద్ధి”
హైదరాబాద్ నగర రూపును మార్చింది BRS పాలన — ఇది ఓటర్లలో వినిపిస్తున్న స్వరం. గత పదేళ్లలో ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, మిషన్ భగీరథ, 2BHK హౌసింగ్, కేబుల్ బ్రిడ్జ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా నగరానికి కొత్త రూపు ఇచ్చింది కేసీఆర్ సర్కారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ — “హైదరాబాద్ అభివృద్ధి అంటే కేసీఆర్ మార్క్. ఆ ముద్ర చెరగదు” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విమర్శలు – BRS కౌంటర్ దూకుడు
“పదేళ్ల పాలనలో BRS చేసింది శూన్యం” అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించగా, BRS నేతలు వెంటనే కౌంటర్ ఇచ్చారు. “రేవంత్ గారు మొదలు పెట్టిన కొత్త ప్రాజెక్టు ఒక్కటి చూపించండి!” అంటూ ప్రశ్నించారు.
హరీష్, కేటీఆర్ లు బృహత్ ప్రచారంలో దూసుకెళ్తూ, “మేము చేసిన పనులే మాకు బలం” అని చెబుతున్నారు.
BJP దూకుడు – కానీ ఫోకస్ BRS పైనే
BJP నేతలు “కాంగ్రెస్, BRS దొందూ దొందే” అని విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రజా చర్చ మాత్రం BRS చుట్టూనే తిరుగుతోంది. “జూబ్లీహిల్స్ రూపు మారింది అంటే అది BRS పాలన వల్లే” అని స్థానికులు చెబుతున్నారు.
మార్పు కోరే ఓటర్లు ఉన్నా, అభివృద్ధి కొనసాగించాలని కోరుకునే వర్గం పెద్దది. హైదరాబాద్ అభివృద్ధి భవిష్యత్ దిశలో ఈ ఉపఎన్నిక ప్రజా తీర్పుగా నిలవనుంది. అభివృద్ధి మార్క్ – BRS మార్క్ – ఎవరి నమ్మకమేనో ఓటర్లు త్వరలో తేల్చనున్నారు.