రసవత్తర పోరులో
ప్రెస్ జట్టు విజయ గర్జన

- టాస్తో మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి
- విజయం ప్రెస్ టీమ్దే – 6 వికెట్ల తేడాతో గెలుపు
తిమ్మాపూర్, జూన్ 2 (విశ్వం న్యూస్): జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ల్లో భాగంగా సోమవారం తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో ప్రెస్ (మీడియా) వర్సెస్ పొలిటికల్ (ప్రజాప్రతినిధులు) మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్కు మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ టాస్ వేయడం ద్వారా శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తుపల్లి మల్లేశం హాజరయ్యారు.

రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో ప్రెస్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆటలో గెలుపు-ఓటములు సహజం. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి పెట్టి, ఆరోగ్యంగా ఉండాలి” అని అన్నారు.
ఈ టోర్నమెంట్లో నియోజకవర్గం మొత్తంగా 32 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఈ నెల 10న, ఎమ్మెల్యే జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించనున్నారు.
