విశ్వకర్మ పేరుతో కొత్త పథకం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 15 : ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద నాయీ బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, ఇతర కులవృత్తుల వారికి రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం.. కళాకారులు.. కళా ఉత్పత్తులు, సేవల నాణ్యత, స్థాయిను మరింత మెరుగుపరచడం.. దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసుతో వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.