తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం: వంటా-వార్పుకు 15 ఏళ్లు

తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టం: వంటా-వార్పుకు 15 ఏళ్లు

హైదరాబాద్, జూన్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చెరగని మైలురాయిగా నిలిచిన చారిత్రాత్మక “వంటా-వార్పు” కార్యక్రమం నిర్వహించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలంగాణ ఉద్యమ రథసారథి K. Chandrashekar Rao (కేసీఆర్) పిలుపుతో 2011 జూన్ 19న నిర్వహించిన ఈ వినూత్న నిరసన దేశవ్యాప్తంగా విశేష దృష్టిని ఆకర్షించింది.

స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి, పల్లె–పట్నం అనే తేడా లేకుండా నడిరోడ్లపై వంటలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసింది. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సహా సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ స్వయంగా గరిటె పట్టి వంట చేయడంతో పాటు ఉద్యమకారులతో కలిసి రోడ్డుపైనే సహపంక్తి భోజనం చేయడం ఉద్యమానికి ప్రతీకాత్మక రూపాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఐక్యత, సంకల్పబలానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.

తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసిన వంటా-వార్పు కార్యక్రమం రాష్ట్ర సాధనలో కీలక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజలు ఈ చారిత్రాత్మక రోజుకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *