‘ఆశ నిండిన శ్వాస’ పుస్తక ఆవిష్కరణ

కరీంనగర్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : ఈ రోజు కరీంనగర్ లోని గణాంక భవన్ లో శ్రీ కసిరెడ్డి జలంధర్ రెడ్డి గారు రచించిన ఆశ నిండిన శ్వాస పుస్తకాన్ని ఆవిష్కరించిన గౌరవ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు గారు. ఈ కార్యక్రమంలో భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్, మానకొండూర్ జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి, ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ, విశ్రాంత ప్రిన్సిపాల్ అన్నాడి గజేందర్ రెడ్డి, కవి గుండు రమణయ్య మరియు ఇతర కవులు, మేధావులు పాల్గొన్నారు.