‘టీ వరల్డ్ షాపు’ప్రారంభించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

జమ్మికుంట, మార్చి 4 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన పర్లపల్లి వెంకటేష్ జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసుకున్న టీ వరల్డ్ షాపు ప్రారంభించిన హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొడ్డె మమత ప్రసాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ టంగుటూరు రాజకుమార్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్, బొద్దుల రవీందర్, బిఆర్ఎస్వి నాయకులు పర్లపల్లి నాగరాజు, ఆలేటి శ్రీరామ్, వెనీశెట్టి నాగరాజు, సంతోష్ యాదవ్, స్వరాజ్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
