జంపన్న వాగులో గల్లంతైన
నలుగురి మృతదేహాలు లభ్యం

వరంగల్, జూలై 28 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న వర్ష బీభత్సం అనేకమంది ప్రాణాలను తీస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లి గ్రామాలను ముంచెత్తడంతో ఊహించని విధంగా అనేకమంది మృత్యు వాత పడ్డారు. నిన్నటికి నిన్న ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల గ్రామల మధ్య ఉన్న జంపన్న వాగు గురువారం ఉప్పొంగడంతో వరద ఉదృతి ఒక్క సారిగా పెరిగింది. దీనితో ఏడుగురు వరద నీటిలో కోట్టుకు పోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రషీద్, షరీఫ్, అజ్జు, మహబూబ్ ఖాన్, మరో నలుగురు వ్యక్తులు గల్లంతైన వారిలో ఉన్నారు.

కాగా గల్లంతైన వారిలో నలుగురి మృత్యువాత పడినట్లు మృతదేహాలను గ్రామస్తులు శుక్రవారం గుర్తించినట్లు సమాచారం.