గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటింటి సర్వే

గోవిందరావుపేట, ఆగస్టు 12 (విశ్వం న్యూస్) : మండలంలో అన్ని గ్రామాల్లో గృహలక్ష్మి కి ధరకాస్తు చేసుకున్న గ్రామాల్లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని శనివారం పసర గ్రామంలో చేపట్టారు . ఈ సందర్భంగా స్థానిక మండల ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్ మరియు పస్ర గ్రామ కార్యదర్శి శరత్ బాబుతో కలిసి ఇంటింటి సర్వేలో భాగంగా మొదటగా ఎస్సీ కాలనీ నుండి మొదలుపెట్టినారు.
ప్రతి దరఖాస్తు దారుని ఇంటి ఇంటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తూ దరఖాస్తు దారుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుంటూ సర్వే చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కుమార్ సితయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.