సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలవనున్న కరీంనగర్ గౌడ సంఘం నాయకులు

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల పండుగ సందర్భంగా
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర ఉత్సవ సందర్భంగా మన గౌడ కుల పెద్దలు మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ , గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ను తేదీ 25-04-23 మంగళవారం రోజున జరిగే బోనాల జాతరకు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తేదీ 17-04-23 సోమవారం రోజున ఉదయం
9 గంటలకు మన కరీంనగర్ గౌడ సంఘ సభ్యులను కలవడానికి అవకాశం ఇచ్చినారు. కావున మన గౌడ కుల బాంధవులు తేదీ 17.4.2023 ఉదయం 5 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్ళవలసి ఉంటుంది. రావడానికి ఆసక్తి ఉన్నవారు ఆలయ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ ను సంప్రదించ గలరని కోరుచు న్నాం.