పార్టీ మార్పుపై తీవ్రంగా
ఖండించిన పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూలై 26 (విశ్వం న్యూస్) : సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి NSUI లో సాధారణ కార్యకర్తగా పని చేస్తూ NSUI కళాశాల ప్రెసిడెంట్ నుండి అంచలు అంచలుగా ఎదుగుతూ ఉమ్మడి రాష్ట్ర NSUI అధ్యక్షుడుగా NSUI నీ బలోపేతం చేస్తూ యువజన కాంగ్రెస్ మరియు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కోసం 35 ఏళ్ళు గా ఎంతో కృషి చేస్తూ… మార్కెఫెడ్ చైర్మన్ గా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు చేత ఎన్నో అవమానాలకు, పెప్పర్ స్ప్రే దాడిగురై చావు అంచుల వరకూ వెళ్ళిన కూడా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడని, బడుగుబలహిన వర్గాల నేతని,నిత్యం తెలంగాణ ప్రజల కోసం మరియు పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పై ఎప్పటికి అపుడు నిలదీస్తూ ప్రజల తర్పున గొంతుక వినిపిస్తున్న.
పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యహరిస్తు ఏ కమిటీ లో చోటు కలిగించకపోవడం కాగా పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్న. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ శ్రీమతి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని, ఈనెల 30వ తారీకు కొల్లాపూర్ లో జరిగే కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ పాల్గొనే సభలో ముఖ్య కార్యకర్తగా పాల్గొటానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.