బాధ్యతలు స్వీకరించిన వేద రజిని

- రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా..
- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని


హైదరాబాద్, జూలై 20 (విశ్వం న్యూస్) : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా శ్రీమతి వేద రజిని (ఆ సంస్థ ఛైర్మన్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం చెందిన శ్రీ వేద సాయిచంద్ భార్య) నాంపల్లి లోని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ గా వేద రజిని బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆమెకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
