మంత్రి గంగులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

తిమ్మాపూర్, జనవరి 6 (విశ్వం న్యూస్) : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (85) ఇటీవల మృతి చెందగా, శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరీంనగర్ లోని మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి, మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు.