ఈ సమ్మర్ చాలా హాట్ గురు

హైదరాబాద్‌, మే 16 (విశ్వం న్యూస్) : రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే మూడు రోజులు సోమ మంగళ వారాలు ఎండల తీవ్రత మరింత పెరిగి 45 డిగ్రీల ఉష్ణోగతలు దాటే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరీంనగర్‌, జనగా మ, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాలు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రా ద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మం చిర్యాల జిల్లాలో ఈ వడగాల్పుల ప్రభావం అధికం గా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం వరకు పగటివేళ ఉష్ణోగత్రలు పెరిగినా, రాత్రి వేళ మాత్రం చలిగాలులు వీచాయి. కానీ, ఇప్పుడు పగటి పూట ఎండలు దంచి కొడుతుండగా.. రాత్రి వేళలో మధ్యాహ్నం వేళ ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *