స్తంభాన్ని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించిన కార్పొరేటర్

బాగ్ అంబర్పేట్, జనవరి 11 (విశ్వం న్యూస్) : బాగ్ అంబర్పేట్ డివిజన్ తురాబ్ నగర్ లో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి తుప్ప పట్టిన విద్యుత్ స్తంభాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తురాబ్ నగర్ లో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉన్నదని, దీనిని వెంటనే మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జ్ వెంకట్ రెడ్డి డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, బిజెపి నాయకులు పోచయ్యముదిరాజ్, దేవరపల్లి రమేష్, E.సుధాకర్, గుగ్గిళ్ళ శ్రీనివాస్,యోగేష్ గౌడ్, సునంద, వరలక్ష్మి, ముఖేష్ గౌడ్, రామ్ రెడ్డి, శ్రీధర్, పాల్గొన్నారు.