ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఇంటర్ విద్యార్థిని
అనుమానాస్పద మృతి

  • కాలేజీ భవనoపై నుంచి దూకిందటున్న యాజమాన్యం..
  • మా బిడ్డను కాలేజీ యాజమాన్యమే హత్య చేశారoటున్న తల్లిదండ్రులు

హన్మకొండ, మార్చి 8 (విశ్వం న్యూస్) : హన్మకొండలోని భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బై పీ సీ మొదటి సంవత్సరం చదువుతున్న శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య గురువారం అర్దరాత్రి కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

గురువారం రాత్రి ఘటన జరిగినా.. శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్ మార్టo తరలించాక ఫోన్లో చేసారని అన్నారు. తమ కూతుర్ని కాలేజీ యాజమాన్యం హత్య చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *