తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల
జారీకి కేబినెట్ ఆమోదం

  • జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, ఆగస్టు 1 (విశ్వం న్యూస్) : కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ గురువారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమై… పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది.

మిగతా నిర్ణయాలు ఇవే..!!
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి
నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం
జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు
కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం
విధివిధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ.. సభ్యులుగా పొంగులేటి, దామోదర రాజనర్సింహ
రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వం.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం
గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం
మూసీలో ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ ఉండేందుకు తగు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *